జియో కొత్తగా లాంచ్ చేసిన జియోపీఓఎస్ లైట్ కమ్యూనిటీ రీఛార్జ్ యాప్తో మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు జియో పార్ట్నర్గా మారొచ్చు. జియో సబ్స్క్రైబర్లకు రీఛార్జ్ చేసి డబ్బులు సంపాదించొచ్చు. అంటే ఎవరైనా జియో యూజర్ ఉంటే వారి నెంబర్కు మీరు రీఛార్జ్ చేసి కమిషన్ పొందొచ్చు. ఈ యాప్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సులువుగానే ఉంది. ఎలాంటి డాక్యుమెంట్, ఫిజికల్ వెరిఫికేషన్ అవసరం లేదు. కేవలం జియోపీఓఎస్ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకుంటే చాలు. రిజిస్టర్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి. ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో జియోపీఓఎస్ లైట్ యాప్ డౌన్లోడ్ చేయండి. అన్ని పర్మిషన్స్ అలో చేయండి. సైన్ అప్ పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ ఐడీ, జియో నెంబర్తో రిజిస్టర్ చేసుకోండి. జనరేట్ ఓటీపీపైన క్లిక్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత డబ్బులు లోడ్ చేయాలి. రూ.500, రూ.1,000, రూ.2,000 ఇలా ఎంతైనా లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఏ జియో నెంబర్కైనా రీఛార్జ్ చేయొచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇతర కస్టమర్లకు కూడా రీఛార్జ్ చేయొచ్చు. మీరు చేసే రీఛార్జ్లపై మీకు 4.16 శాతం కమిషన్ వస్తుంది. అంటే మీరు రూ.100 రీఛార్జ్ చేస్తే మీకు రూ.4.16 కమిషన్ వస్తుంది. యాప్లో పాస్బుక్ ఉంటుంది. అందులో మీకు ఎంత కమిషన్ వచ్చిందో తెలుసుకోవచ్చు. గత 20 రోజుల ట్రాన్సాక్షన్స్ కూడా చూడొచ్చు. అయితే ఇప్పటికే మైజియో యాప్ లేదా వెబ్సైట్లు ఉపయోగించేవారికి మీరు రీఛార్జ్ చేస్తే ఎలాంటి కమిషన్ రాదు. వారికి రీఛార్జ్ మాత్రమే చేయగలరు.