ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 10:39 AM

ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో వార్డు,గ్రామ క్లినిక్స్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ లాంటి రోగాలు ప్రబలినప్పుడు ఈ క్లినిక్ ల ద్వారా చికిత్సను వేగవంతంగా అందించడంతో పాటు బాధితులను వెంటనే గుర్తించవచ్చన్నారు. గతంలోనే క్లినిక్ ల ఏర్పాటు గురించి చర్చించినా అది ముందుకు పడలేదు. దీంతో వెంటనే వార్డు,గ్రామ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం పలు అంశాల పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, పాఠశాలల్లో నాడు–నేడు ,గ్రామ సచివాలయాల నిర్మాణం పై దృష్టిపెట్టాలన్నారు. మార్చి 2021 కల్లా వీటి నిర్మాణం పూర్తి కావాలన్నారు. వార్డు క్లినిక్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని పై మ్యాపింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా వైద్య సదుపాయాలు పెంచుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. భవిష్యత్ లో కరోనాలాంటి వైరస్ ను ఎదుర్కోవడంలో విలేజ్,వార్డు క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com