జెనీవా: భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేదని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ తేల్చి చెప్పింది. అయితే ఇంతకి ముందు గతంలో భారత్ లో కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ ఉందని నివేధికలో పేర్కొన్న విషయం తెలిసిందే.అయితే తన పొరపాటును డబ్ల్యూహెచ్ఓ ఒప్పుకుంది. మొదట ఇచ్చిన నివేదికను సవరించి తాజాగా మరో నివేదికను వెళ్లడించింది. భారత దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ ఇచ్చింది.