ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజుకు 3 జీబీ డేటా ప్లాన్స్ ఇచ్చేవి ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 11, 2020, 10:29 AM

లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బిజీగా గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో రోజూ 3 జీబీ డేటా అందించే ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అలవాటు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ 4జీ డేటా ఏమాత్రం సరిపోవట్లేదు. అందుకే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్స్ కోసం యూజర్లు సెర్చ్ చేస్తున్నారు. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రోజూ 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ జియో: రిలయన్స్ జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడొచ్చు. 1000 నిమిషాల జియో నుంచి నాన్ జియో కాల్స్ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్ టెల్: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. మొత్తం 84 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా: వొడాఫోన్ ఐడియాలో రూ.398 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. మొత్తం 84 జీబీ వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com