లాక్డౌన్ కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. స్మార్ట్ఫోన్లో సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో బిజీగా గడిపేస్తుంటారు. ఇలాంటి సమయంలో రోజూ 3 జీబీ డేటా అందించే ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అలవాటు. కానీ ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ 4జీ డేటా ఏమాత్రం సరిపోవట్లేదు. అందుకే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్స్ కోసం యూజర్లు సెర్చ్ చేస్తున్నారు. రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రోజూ 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ను అందిస్తున్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రిలయన్స్ జియో: రిలయన్స్ జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్లో అన్లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడొచ్చు. 1000 నిమిషాల జియో నుంచి నాన్ జియో కాల్స్ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్ టెల్: ఎయిర్టెల్లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. మొత్తం 84 జీబీ డేటా పొందొచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా: వొడాఫోన్ ఐడియాలో రూ.398 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. మొత్తం 84 జీబీ వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా లభిస్తాయి.