కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కేవలం సరుకులు, కూరగాయలు తెచ్చుకోవడానికి బయటకు వెళ్తున్నారు. పట్టణాలు, నగరాల్లో ఇక ఈ కష్టాలు అవసరం లేదు. ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఇంటికి సరుకులు, కూరగాయలు డెలివరీ చేయనుంది. ఇప్పటికే బెంగళూరు, గురుగ్రామ్లో ఈ సేవల్ని ప్రారంభించింది స్విగ్గీ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో గ్రాసరీ డెలివరీ సేవలు అందించబోతోంది. స్విగ్గీ యాప్లో గ్రాసరీస్ కోసం ప్రత్యేకంగా ఓ సెక్షన్ కనిపిస్తుంది. ఎక్కడెక్కడ సేవలు అందుబాటులో ఉన్నాయో యాప్లో కనిపిస్తాయి. ఆర్డర్ చేసిన వారికి సరుకులు, కూరగాయలు డెలివరీ చేసేందుకు ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది స్విగ్గీ. ప్రస్తుతం మారికో, సఫోలా బ్రాండ్స్తో టైఅప్ చేసుకుంది. ఇక స్విగ్గీ గో పేరుతో ఉన్న సేవల్ని స్విగ్గీ జీనీ పేరుతో రీబ్రాండ్ చేసింది. దీని ద్వారా దగ్గర్లోని స్టోర్ల నుంచి వస్తువుల్ని ఇంటికి డెలివరీ చేస్తుంది.