ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3 నెలలు కావాల్సినన్ని బీర్లు ఫ్రీ..కానీ ఓ షరతు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 11:46 AM

కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. కనీసం ఒకరికి ఒకరు సాయం చేసుకోలేని పరిస్థితి ఉంది. మూగజీవాల పరిస్థితి దారుణంగా మారింది. వాటికి తిండి లేక,రక్షణ చర్యలు లేక అల్లాడుతున్నాయి. కరోనా భయంతో కొన్ని జంతు సంస్థలు మనుషులను దగ్గరకు రానివ్వడం లేదు. కానీ ఓ యానిమల్ రెస్క్యూ సంస్థ మాత్రం కుక్కలను దత్తత ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దత్తత తీసుకున్న వారికి ఆ సంస్థ భారీ ఆఫర్ ను కూడా ప్రకటించింది. కుక్కను దత్తత తీసుకున్న వారికి 3 నెలలు తాగినన్ని బీర్లు అందజేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కరోనా దెబ్బతో జంతు సంస్థలు జంతువులను దత్తత ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. కానీ అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న మిడ్ వెస్ట్ యానిమల్ రెస్క్యూ సంస్థ 500 కుక్కలను దత్తత ఇవ్వాలని నిర్ణయించింది. దత్తత తీసుకున్న వారు దానికి సపర్యలు చేయాల్సి ఉంటుంది. అలా కుక్కలను దత్తత తీసుకున్న వారికి యానిమల్ సంస్థ ఓ భారీ ఆఫర్ ను ప్రకటించింది. కుక్కను దత్తత తీసుకున్న వారికి 3 నెలల పాటు తాగినన్ని బీర్లు సరఫరా చేస్తామని తెలిపింది. దీనికి సంబంధించి యానిమల్ సంస్థ బుష్ బీర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కుక్కను దత్తత తీసుకున్న వారు ప్రూఫ్ గా కుక్కతో ఫొటో దిగి బుష్ బీర్ కంపెనీ ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు పంపించాలి. ముందుగా పంపించే వారికి 100 డాలర్ల(రూ.7500) రివార్డ్ కూడా ఇస్తుంది. ఈ ఆఫర్ మార్చి 25 నుంచి ఏప్రిల్ 25 వరకు మాత్రమే ఉంటుందని ఆ బీర్ కంపెనీ తెలిపింది. కరోనా ప్రభావంతో యానిమల్ సంస్థ ఈ ఆఫర్ ను ప్రకటించింది. దీనికి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి మరీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com