ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2020, 11:58 AM

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 24 గంటలు డ్యూటీ చేస్తూ ప్రజలు బయటికి రాకుండా చూస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన పోలీసులకు మరియు హృద్రోగ,మధుమేహం,శ్వాస వంటి సమస్యలు ఉన్న వారికి క్షేత్రస్థాయి డ్యూటి వేయవద్దన్నారు. వారికి పోలీస్ స్టేషన్,ఆఫీస్,కంట్రోల్ రూంలలో మాత్రమే డ్యూటీలు వేయాలని చెప్పారు. దీనికి సంబంధించి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదివారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పోలీసులు వయస్సుతో సంబంధం లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పోలీసులు, 55 సంవత్సరాలు దాటిన పోలీసులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గంటలు గంటలు నిలబడి,ఎండకు తట్టుకోలేక వారు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com