ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజయోగిని దాదీ అస్తమయం

national |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 01:53 PM

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సంస్థాన్‌ అధ్యక్షురాలు, రాజయోగిని దాదీ జానకి అస్తమించారు. శ్వాస, ఉదర సంబంధ సమస్యలతో రెండు నెలలుగా బాధపడుతున్న ఆమె శుక్రవారం అర్థరాత్రి 2 గంటలకు రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో 1916 జనవరి 1న జన్మించిన దాదీ 21 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక జీవనంలోకి వచ్చారు. ప్రపంచంలోనే మహిళలు నడుపుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా బ్రహ్మకుమారీస్ నిలవడం విశేషం. కేంద ప్రభుత్వం పారిశుద్ధ్య పరిరక్షణకు ఆమె చేసిన కృషిని గుర్తించిన దాదీని 'స్వచ్చ భారత్‌ అభియాన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. కాగా దాదీ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com