ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ లో ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ సేవించి వందల మంది మృతి

international |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 01:15 PM

ఇరాన్ లో కరోనా విజృభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 33వేల మంది కరోనా బారిన పడ్డారు. 2400 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీనితో ఇరాన్‌లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మరోవైపు ఇక్కడి ప్రజలు అవగాహనా లోపంతో కరోనాకు విరుగుడుగా ఇండస్ట్రియల్‌ ఆల్కహాల్‌ను సేవిస్తుండటంతో పరిస్థితి మరింతగా విషమిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన ఆల్కహాల్‌ను సేవిస్తే అది వైరస్‌ను చంపివేస్తుందనే అపోహతో పలువురు మెథనాల్‌ను తాగుతున్నారు. మెథనాల్‌ను తాగడం వలన ఇది శరీర భాగాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో మెథనాల్‌ ను తాగడంతో ఈనాటివరకు ఇరాన్‌లో 300 మంది మరణించారు. 1000 మందికి పైగా జనం అనారోగ్యానికి గురయ్యారని ఇరాన్‌ మీడియా వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com