అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం మోగిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా 68,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,032మంది మరణించారు. కేవలం బుధవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 223 కరోనా మరణాలు నమోదయ్యాయి. అంతకుముందు రోజు మంగళవారం 164మరణించారు. నాలుగు రోజుల క్రితం 300మరణాలు ఉండగా ప్రస్తుతం వెయ్యి దాటడం ఆందోళన కలిగిస్తోంది. చైనా, ఇటలీ వెలుపల అత్యధిక కొవిడ్-19 కేసులు అమెరికాలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యయికస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న అమెరికా రాష్ట్రాలు ఈ పరిస్థితిని భారీ విపత్తుగా ప్రకటిస్తున్నాయి.