ఇచ్చిన మాట ప్రకారమే జగన్ అందరికి ఇల్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారు అని అయన అన్నారు. రాజధానిలోకి పేదలెవ్వరు రాకూడదని చంద్రబాబు చూశారు. గత ఐదేళ్లుగా భూములు అమ్మికోవడానికే చూశారు. చంద్రబాబు చేసిన అన్యాయమైన ల్యాండ్ పూలింగ్ ఎవ్వరు మర్చిపోలేదు అని అయన అన్నారు. పేదలకు ఇల్లు ఇప్పించడం సిపిఐ మూల సిద్ధాంతమని అయన అన్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సిపిఐ రామకృష్ణ వ్యతిరేకిస్తుంటే సిపిఐ కూడా చంద్రబాబు కంపెనీ పార్టీనే అని అయన అన్నారు. బూటకపు పర్యటనలు చేసిన పవన్ కూడా కళ్ళు తెరవాలని అయన అన్నారు.