ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిగెడుతూ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 11:55 AM

మీరెవరైనా రోజుకు 100 కిలోమీటర్లు పరిగెత్తగలరా? మూడు రోజుల పాటు వరుసగా ఇలా చేయగలరా? వినేందుకు అసాధ్యం అనిపిస్తుంది కదూ! కానీ, ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించేందుకు ఓ వ్యక్తి సన్నద్ధమవుతున్నారు. అది కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే. విజయ్ యార్గల్ అనే అల్ట్రా మారథాన్ రన్నర్ మార్చి 11న ఈ పరుగును ప్రారంభించబోతున్నారు.


రక్తదానం చేయాల్సిన అవశ్యకతను చాటేందుకు ఇతను ఈ పరుగును చేపట్టనున్నారు. మార్చి 11న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఇతని పరుగు మొదలై మార్చి 14న హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద ఇతని పరుగు ముగుస్తుంది. మొత్తం 322 కిలోమీటర్ల పరుగును తన బృందంతో కలిసి కేవలం 3 రోజుల్లో పూర్తి చేయాలని రన్నర్ విజయ్ యార్గల్ తలపెట్టారు.


సాధారణంగా హాఫ్ మారథాన్ (21 కిలోమీటర్లు) లేదా ఫుల్ మారథాన్ (42 కిలోమీటర్లు) చేయాలంటే కఠోర శ్రమ, అనుభవం ఉండాల్సి ఉంటుంది. కానీ, ఈ స్థాయులన్నింటినీ మారథాన్ రన్నర్ విజయ్ యార్గల్ గతంలోనే దాటారు. ప్రస్తుతం సుదీర్ఘ దూరం రన్నింగ్ చేయడంపై దృష్టి పెట్టారు. అయితే, మార్చి 11న చేపట్టబోయే పరుగులో విజయ్‌తో పాటుగా మరో 50 మంది పరుగుల వీరులు పాల్గొననున్నారు. వీరిలో కనీసం ఐదుగురు ఎప్పుడూ విజయ్‌తో పాటు పరుగులో పాల్గొంటారు. ఈ ఐదుగురి తర్వాత మరో ఐదుగురు విజయ్‌తో పరుగును ప్రారంభిస్తారు. ఈ టీమ్‌లో విజయవాడ నుంచి 15 మంది, హైదరాబాద్‌నుంచి మరో 35 మంది రన్నర్లు పాల్గొననున్నారు. పరుగుపందెంలో భాగంగా అత్యవసర కిట్లతో కూడిన ఓ వాహనం వీరి వెంటనే ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com