రాష్ట్రపతి భవన్ లో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు గైర్హాజరు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి మన్మోహన్ సమాచారం తెలిపారు. అనారోగ్య కారణాల రీత్యా హాజరుకాలేకపోతున్నానని మన్మోహన్ చెప్పినట్టు సమాచారం. కానీ, అసలు కారణం అది కాదని, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాను ఈ విందుకు ఆహ్వానించకపోవడం వల్లే మన్మోహన్ వెళ్లడం లేదని తెలుస్తోంది. మన్మోహనే కాదు ఆహ్వానం అందుకున్న కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్ కూడా విందుకు వెళ్లడం లేదని సమాచారం. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.