అమరావతి : ఇకపై పోలీసు విచారణలో లాయర్ల భాగస్వామ్యం కానున్నారు. విదేశీ తరహా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ప్రాసిక్యూషన్ లో న్యాయవాదులకు భాగస్వామ్యం కల్పిస్తూ నిర్ణయించింది. ఇందుకుగాను 49 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టింది. ఈ నియామకం కోసం పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఫలితాలను హోంమంత్రి సుచరిత, డిజిపి సవాంగ్ విడుదల చేశారు. రిక్రూట్ అయిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వారం రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు.