ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే ఓర్వలేని వారు ఉంటారని.. టీడీపీ అధినేత చంద్రబాబు లాంటి వారికి చాలా కడుపుమంట ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ కర్నూల్లో మూడవ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేన్సర్కు చికిత్స ఉంది కానీ... అసూయతో వచ్చే కడుపుమంటకు చికిత్స లేదన్నారు. చెడు దృష్టికి ఎక్కడా చికిత్స లేదని వ్యంగ్యంగా మాట్లాడారు. 'నిజాయితీతో పనిచేస్తున్నాం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నాం. ప్రజల ఆరోగ్యం, ఆనందం, భవిష్యత్ కోసం గట్టిగా నిలబడతాను ' అని జగన్ స్పష్టం చేశారు.