కర్నూలుకు కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ కార్యాలయాల తరలింపుపై రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమంటూ రాజధాని ప్రాంత రైతులు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్టు రేపు విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ ఛైర్మన్, సీఆర్డీఏను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు.