3 రాజధానుల అంశంపై ప్రజాభిప్రాయం తీసుకోవాలని కోరామని చంద్రబాబు అన్నారు. మీరు ఎన్ని చేసిన మా ఎమ్మెల్సీలు లొంగలేదు అని అన్నారు. ఎమ్మెల్సీలు మీరు ఏమీ భయపడకండి... మండలి రద్దు చేసే అవకాశం లేదు అని అన్నారు. మండలి రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించవచ్చు అని అన్నారు. శాసన మండలిని రద్దు చేసినా మళ్ళీ మేము వచ్చిన తర్వాత పునరుద్ధరిస్తామని అన్నారు.