ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెరిటేజ్ పై అసెంబ్లీ లో మంత్రి వ్యాఖ్యలు: చంద్రబాబు ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 09, 2019, 08:24 PM

ఏపీ శాసనసభలో హెరిటేజ్ సంస్థ గురించి మంత్రి పుష్ప శ్రీవాణి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. హెరిటేజ్ కు సంబంధించిన స్వీట్స్ ను నారా బ్రాహ్మిణి తమకు పంపించారని, హెరిటేజ్ వారిది కాకపోతే తమకు ఆ స్వీట్స్ ఎలా పంపిస్తారని శ్రీవాణి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా చంద్రబాబు వివరణ ఇస్తూ హెరిటేజ్ ఫుడ్స్, హెరిటేజ్ ఫ్రెష్ కు తేడా తెలియనివారు ఈ సభలో ఉన్నారని విమర్శించారు. ఈ రెండూ వేర్వేరని… హెరిటేజ్ ఫ్రెష్ ను ఫ్యూచర్ గ్రూప్ కు ఎప్పుడో అమ్మేశామని చెప్పారు. ఏం మాట్లాడుతున్నారో కూడా వీరికి తెలియడం లేదని అన్నారు. ప్రజల సమస్యలన్నీ గాలికొదిలేసి, 24 గంటలు తనమీద బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com