వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజినీకి ఒక దళితుడి నుంచి హెచ్చరిక జారీ అయ్యింది. తనకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన కారును ఎమ్మెల్యే రాకుండా చేశారని ఆవేదన చెందుతూ ఒక వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయియ్తే యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన శ్యామేల్ తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కారును వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ అధికారులకు ఫోన్ చేసి మరీ ఆపించారని ఇప్పటి వరకు ఆరు నెలలు గడిచినా తనకు ఇంకా ఆ కారు రాలేదని భార్య, పిల్లల పోషణ కష్టంగా మారిపోయిందని వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లబుచ్చాడు. అయితే ఇక తిరిగే ఓపిక తనకు లేదని ఈ నెల 15లోపు సమస్యను పరిష్కరించకపోతే కుటుంబంతో సహా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే గారికి ముందస్తు హెచ్చరిక అంటూ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాలలో వైరల్గా మారింది.