దిశ హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై విజయవాడలో మహిళా సంఘాలు స్వాగతించాయి. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు అరికట్టాలంటే కఠిన చట్టాలు రూపొందించాలని అంటున్నారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ... ఈ ఒక్క విషయంలోనే కాకుండా ప్రతి మహిళ, చిన్నారులకు జరిగే విషయంలో కూడా ఇలాగే ఎన్కౌంటర్ జరిగితే బాగుంటుందని, దీనిని చట్టం చేస్తే బాగుంటుందని అదే తమ పోరాటమని మహిళలు అన్నారు. దిశకు తొందరగానే న్యాయం జరిగిందని భావిస్తున్నామన్నారు. అయితే ఎవరికివారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని.. దీన్ని చట్టం చేయాలని మహిళలు కోరుతున్నారు. తప్పు చేసే వ్యక్తి చట్టానికి భయపడాలన్నారు. దిశ హత్య జరిగి.. 9వ రోజునే న్యాయం జరగడం హర్షనీయమన్నారు.