జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన మరియు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైనే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు చేసినటువంటి దీక్షనుద్దేశించి పలు విమర్శలు గుప్పించారు. సొంత పుత్రుడు , దత్త పుత్రుడు దీక్షలా తరువాత చంద్రబాబు దీక్ష మొదలు పెట్టారని అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు. చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని అన్నారు, నిన్నటి దీక్షలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ల కంటే గొప్పగా చంద్రబాబు నటించాడని అన్నారు.
నిన్నటి దీక్షలో జగన్ డౌన్ డౌన్ అని నారా లోకేష్ అనగానే టీడీపీ నేతలు ఇద్దరు జారుకున్నారని అన్నారు. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారని విమర్శలు చేశారు. అంతే కాకుండా సీఎం జగన్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేయడం పాలసీ మ్యాటర్ అవుతుందా అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కు, పవన్ కళ్యాణ్ కి ఇసుక, ఇంగ్లీష్ మీడియం తప్ప ఇంకేం దొరకట్లేదని ఎద్దేవా చేసారు, అంతే కాకుండా పవన్ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం లో చదువుకోవచ్చా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు దైర్యం గురించి మాట్లాడుతూ పలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క కేసు పెట్టగానే భయపడి పారిపోయి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా అమరావతి లో చంద్రబాబు చేసిన అవినీతి బయటకు వస్తుందని, చంద్రబాబు కి కేంద్రం వెళ్లే అవకాశం లేకనే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు దూతగా ఢిల్లీకి పంపి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేసారు అంబటి రాంబాబు. మరి ఈ విషయం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.