జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొకసారి జగన్ ప్రస్తావన తీసుకువచ్చారు. అసలు విషయం ఏమిటంటే, రాజధాని భవన నిర్మాణ కార్మికుల విషయం లో జగన్ ని టార్గెట్ చేసిన పవన్ పలు ఆసక్తికర విషయాలని తెలిపారు. అమరావతి నిర్మాణానికి గతంలో వైసీపీ అంగీకారం తెలిపి, ఇపుడు అధికారం లోకి వచ్చాక అమరావతి నిర్మాణాన్ని ఆపేశారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. అయితే రాజధాని కి అన్ని వేల ఎకరాల భూమి ఒద్దు అని అనుకుంటే తక్కువ స్థలం లో నిర్మించ వచ్చని అన్నారు. వీలైనంత త్వరగా జగన్ రాజధాని విషయం లో నిర్ణయం తీసుకుంటే మంచిదని అన్నారు. అయితే మరొకసారి పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి గురించి ప్రస్తావించారు. అయితే నిర్మాణాల్ని ఆపేశారని ఒక పక్క విమర్శలు చేస్తూనే మరొక పక్క జగన్ కి చురకలు అంటించారు. రాజధానిని పులివెందుల లో పెట్టాలనుకుంటే ప్రజామోదం తో పెట్టండి దానికి జనసేన కూడా మద్దతు తెలుపుతుంది అంటూ ఎద్దేవా చేసారు. వ్యక్తి గతంగా ఎవరిని విమర్శించనని, కార్మికులు చనిపోతే ప్రశ్నించకూడదా అని అన్నారు. మరి పవన్ తీసుకున్న ఈ నిర్ణయం లో జగన్ స్పందిస్తారో లేదో చూడాలి.