విశాఖపట్నం: లంచం డిమాండ్ చేసిన కేసులో ఐఆర్ఎస్ అధికారి, మాజీ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ ఎస్పీ సింగ్కు విశాఖపట్నం ప్రత్యేక న్యాయస్థానం (సీబీఐ కేసుల కోర్టు) రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతోపాటు ఎస్పీ సింగ్కు రూ.20 వేల జరిమానా విధించింది. ఎస్పీ సింగ్ 2005లో విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్గా ఉన్నపుడు ఎస్ఎంఎల్ డైటెక్స్, ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాసవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీని లంచం డిమాండ్ చేసినట్లు కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టి తీర్పువెలువరించింది. ఎస్పీ సింగ్ 1973 బ్యాచ్ ఐఆర్ ఎస్ క్యాడర్ అధికారి.