ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి దేవస్థానంలో ఆర్జిత సేవలు రద్దు.. అసలు కారణం ఇదేనా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 04:49 PM

ప్రస్తుత పవిత్ర కార్తీకమాసంలో నవంబరు 17వ తేదీ ఆదివారం తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని తిరుమలలోని పార్వేట మండపంలో టిటీడీ నిర్వహించబోతుంది. ఈ కార్తీక వనభోజన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీమలయప్ప స్వామివారిని బంగారుతిరుచ్చిపై, దేవేరులను మరో పల్లకిపై అందంగా అలంకరించి కూర్చుండబెట్టి వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకొని వెళ్లడం జరుగుతుంది. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్వామి వారిని ఒక చిన్న గజవాహనంపై వాహనమండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది. అదే విధంగా మరో పల్లకిపై ఉభయ నాంచారులను రంగనాయక మండపం నుండి పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళతారు.


కార్తీక వనభోజన మహోత్సవం నేపథ్యంలో ఇక్కడ శ్రీ భూదేవి, శ్రీ దేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ వన భోజన మహోత్సవాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్ద కుమారుడైన పెద తిరుమలాచార్యుల వారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు కూడా ఉండడం చాల గమనార్థకం. అయితే ఏ కారణాల వల్లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగిపోయింది.


ఈ ఉత్సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం నుండి పునరుద్ధరించింది. ఈ మేరకు కార్తీక వనభోజనోత్సవం ఈ ఏడాది నవంబరు 17వ తేదిన పార్వేట మండపంలో మధ్యాహ్నం 1.00 నుండి 2.00 గంటల నడుమ ఘనంగా నిరవహించ బోతున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగు ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేయడం జరిగింది.


భక్తులు అందరు కార్తీక వనభోజన మహోత్సవనికి రావాలని కోరడం జరిగింది. కార్తీక మాసంలో వన భోజనం చేయడం వల్ల కూడా చాల లాభాలు ఉన్నాయి అని పూరణలు చెపుతాయి. అందుకే శ్రీవారి సన్నిధిలో మహోత్సవానికి హాజరుకావాలని కోరడం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com