ఆంగ్లం అవసరమే కానీ తెలుగు భాషను కాపాడుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలోఆయన మాట్లాడుతూ… తమిళ భాష మీద మాట్లాడితే… తమిళనాడు మొత్తం ఏకమైందని గుర్తుచేశారు. మేధావులు బయటకు వచ్చి మాట్లాడాలన్నారు. తెలుగు భాష, ఉనికిని మంటగలిపితే నాశనమైపోతారన్నారు. ఇప్పుడు మేల్కొనకపోతే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందన్నారు.