ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు 'దధీచి దేహదాన్ సమితి' ఆధ్వర్యంలో మంగళవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రాణాన్ని ఇచ్చి మరో ప్రాణాన్ని కాపాడలేమని.. మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా మాత్రం ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. అపోహలు, అనుమానాలు వీడి అందరూ అవయవదానానికి ప్రతినబూనాలని పిలుపునిచ్చారు.