రాజస్థాన్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రాజస్థాన్ లోని బికనీర్లోని దేశ్నోక్ వద్ద కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు నిర్దారించారు.