తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు టీటీడీ వరాలు ప్రకటించింది. టీటీడీలో ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ క్పలించాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాలకమండలిని కోరారు, ఇకపై ఉద్యోగాల భర్తీలో 75 శాతం చిత్తూరు జిల్లా వాసులకే ఇవ్వాలని నిర్ణయించింది. లోకల్ రిజర్వేషన్ తీర్మానాన్ని టీటీడీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తమ నిర్ణయానికి ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ఈ రిజర్వేషన్ టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తికి వర్తించనుంది. భూమన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం టీటీడీ తీర్మానాన్ని ఆమోదిస్తుందో లేదో వేచి చూడాలి.