ఇంగ్లీష్ మీడియాన్ని ప్రజల అభ్యర్ధన మేరకే ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ చేర్చారని, ఇప్పుడు అదే అమలు చేస్తున్నారని అధికారభాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డలక్ష్మీ ప్రసాద్ అన్నారు. తెలుగుమద్యమాన్ని కూడా కొనసాగించాలని సిఎం జగన్ ను కోరుతానన్నారు. తెలుగును ఒక సబ్జెక్ట్ గా ప్రవేశపెట్టే జీఓ 81 వల్ల లాభమే జరుగుతుందన్నారు. ఈ జీఓ వల్ల అన్ని సిబిఎస్సీ, ఐసిఎస్సీ , ఓక్రిడ్జ్ పాఠశాలల్లో తెలుగుభాష కనిపిస్తుంది, వినిపిస్తుందని తెలిపారు.