న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్, ఒడిషా సహా బంగ్లాదేశ్లో బీభత్సం సృష్టిస్తున్న బుల్ బుల్ సైక్లోన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమీక్ష సమవేశం నిర్వహించారు. తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రమాదంలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగల్ సీఎం మమతా బెనర్జీతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. తుఫాను బాధితులను అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు.