దేశ రాజధానిలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం మనీష్ పిసోడియా సైకిల్ పై తన కార్యాలయానికి చేరుకున్నారు. వాహన వినియోగాన్ని తగ్గించాలన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆయనీ చర్య తీసుకున్నారు. ఇలా ఉండగా వాయుకాలుష్య నివారణలో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ తీసుకువచ్చిన సరి బేసి విధానం ఈ రోజు నుంచి ఈ నెల 15వరకూ అమలులో ఉంటుంది.