గుంటూరు: పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కాదని, రాంగ్ మార్చ్ అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజిక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించారని విమర్శించారు. చంద్రబాబు ఎజెండాను మోయటమే పవన్ పాలసీ అన్నారు. చంద్రబాబు ఉనికి కోసమే పవన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడేనన్నారు. బాబు హయాంలో కార్మికుల సమస్యలపై పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి సమయం ఇచ్చేంతస్థాయి పవన్కు లేదన్నారు.