మర్రిపాడు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం జరిగింది. సందర్భంగా తొలి దశలో కంటి పరీక్షలు నిర్వహించి అధికంగా కంటి చూపులో లోపం ఉన్న వారిని గుర్తించి లెన్సెస్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని వైద్యాధికారి వెంకట కిషోర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల్లో అంధత్వ నివారణ లక్ష్యంగా ప్రభుత్వం ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ప్రతిరోజూ ముప్పై అయిదు మందిని పరీక్షించడం జరుగుతుందని తెలిపారు. అధికంగా కంటి చూపులో లోపం ఉన్నవారిని లెన్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన అందాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శివజ్యోతి, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.