న్యూఢిల్లి : కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోగ్యంపై నివేదిక సమర్పించాలని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను ఢిల్లి హైకోర్టు ఆదేశించింది. ఎయిమ్స్లో చిదంబరానికి చేసిన చికిత్సపై ఆయన కుటుంబ వైద్యుడు, హైదరాబాద్కు చెందిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సభ్యుడిగా ఒక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.