గుంటూరు: రాష్ట్రంలో ఇసుక సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇసుక కొరతపై, భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన ఒక్కరోజు దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఇసుక నూతన విధానం వల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.