ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: నారా లోకేశ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 30, 2019, 03:49 PM

గుంటూరు: రాష్ట్రంలో ఇసుక సమస్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఇసుక కొరతపై, భవన నిర్మాణ కార్మికులకు సంఘీభావంగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ఆయన ఒక్కరోజు దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ ఇసుక నూతన విధానం వల్ల నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com