అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్స్టేషన్లో లాకప్డెత్ జరిగినట్టు సమాచారం అందుతోంది. ఇటీవల అక్రమంగా గుట్కా నిల్వ చేశారంటూ ఫామిదా అనే మహిళ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అయితే ఫామిదా లాకప్లో చలనం లేకుండా పడిపోయిన ఆమెను పోలీసులు ప్రభుత్వ ఆసుప్రతికి హుఠాహుటిన తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం ఆనోటా ఈనోటా పాకి ఫామిదా బంధు గణానికి చేరింది. వారు పెద్ద ఎత్తు పోలీస్ స్టేషన్కు చేరుకుని పోలీసుల దెబ్బలు తాళలేక వృద్ధురాలు ఫామిదా మృతి చెందినట్టు నినాదాలు చేసారు. అయితే ఈ డెత్పై తమపై వస్తున్న ఆరోపణలు కొట్టిపడేస్తున్న పోలీసులు తప్పించుకునేందుకు ఉన్నతాధికారుల అండతో ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వృద్ధురాలి మృతి కారకులైన పోలీసులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.