ఈ సారి యుద్దం వస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆర్టికల్ 370 కారణంగానే గతంలో పాకిస్థాన్ తో యుద్ధాలు జరిగాయన్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాటాకుచప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. ఆర్టికల్ 370పై ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370ని బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకించిందని, మోడీ వందరోజుల పాలనలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.