ఫ్లిపే (ఎఫ్ఎల్ఐపీఈ) పదం అక్షరక్రమాన్ని (స్పెల్లింగ్) నూటికి నూరుశాతం కచ్చితంగా చెప్పిన భారత సంతతి అమెరికన్ విద్యార్థి నవ్నీత్ మురళి 2019 సంవత్సరపు దక్షిణాసియా స్పెల్లింగ్ బీ (ఎస్ఏఎస్బీ) పోటీ విజేతగా నిలిచాడు. ఈ బహుమతి కింద మూడువేల డాలర్లు (దాదాపు రూ.2.14 లక్షలు) లభించాయి. ప్రథమ రన్నరప్లుగా సన్నీవేల్కు చెందిన వయున్ కృష్ణ, ఫోర్ట్వర్త్ నివాసి హెబ్సిబా సుజో, ఆస్టిన్కు చెందిన ప్రణవ్ నందకుమార్ నిలిచారు.