తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్ లో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ లొంగిపోయారు. ఆదివారం రాత్రి మలికిపురం పీఎస్ ఎదుట అనుచరులతో ఎమ్మెల్యే వరప్రసాద్ ధర్నా చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని ఎమ్మెల్యేపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు కాసేపట్లో రాపాక వరప్రసాద్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.