ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశ్మీర్‌ అసెంబ్లి స్థానాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 03:24 PM

కాశ్మీర్‌లో శాసనసభ నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు సమావేశమై చర్చించారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర, ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు సమావేశమయ్యారు. జమ్ము కాశ్మీర్‌ను శాసనసభ ఉండే యూనియన్‌ టెరిటరీగా, లడఖ్‌ను శాసనసభ లేని యూనియన్‌ టెరిటరీగా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ శాసనసభ నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ అధికారులు చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com