కాశ్మీర్లో శాసనసభ నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నేడు సమావేశమై చర్చించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం ఎలక్షన్ కమిషన్ అధికారులు సమావేశమయ్యారు. జమ్ము కాశ్మీర్ను శాసనసభ ఉండే యూనియన్ టెరిటరీగా, లడఖ్ను శాసనసభ లేని యూనియన్ టెరిటరీగా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ శాసనసభ నియోజక వర్గాల పునర్విభజనపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్చిస్తున్నారు.