భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాశ్మీర్ నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోదని పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. బుధవారం జరిగిన ఆదేశ జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) సమావేశంలో ఆయన భారత దేశంపై నిప్పులు చెరిగారు.
ఇకపై పాక్ భారత్ల మధ్య ఎలాంటి చర్చలు ఉండవని ఇమ్రాన్ ఈ సమావేశంలో స్పేటం చేసారు. అలాగే ఇస్లామాబాద్లో ఉన్న భారత రాయబారులను వెనుకకు పంపించే యాలని నిర్ణయించామని, భారత్లో ఉన్న పాకిస్థాన్ రాయబారులు ఇక అక్కడ ఉండనవసరం లేదని అన్నారు .
ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం భారత్ తో ఇప్పటి వరకు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం నిలుపుదల చేయడం తో పాటు ద్వైపాక్షిక ఒప్పందాల సమీక్ష చేయాలనీ నిర్ణయం జరిగింది. అలాగే భారత దేశంతో దౌత్య సంబంధాల కుదించుకోవాలని భావిస్తోంది. మరో వైపు కాశ్మిర్ పై భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ మీడియా కూడా అక్రమం,అప్రజాస్వామికం అని విమర్శించింది.