ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లి పర్యటనలో ఉన్న సీఎం జగన్ మధ్యాహ్నానికల్లా రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రానికి వచ్చిన వెంటనే సీఎం జగన్ హెలికాప్టర్ లో పోలవరంకు చేరుకొని కాఫర్ డ్యామ్ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం పోలవరం వద్ద అధికారులతో వరద, సహాయక చర్యలపై సమీక్షించనున్నారు.