జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా శాశ్వతం కాదని తాత్కాలికం మాత్రమేనన్నారు. లోక్ సభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడిన అమిత్ షా జమ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ, క్యాబినెట్ ఉంటుందని, లఢక్ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదని.. ఓ చారిత్రక తప్పిదాన్ని సరిచేయడమే తమ ఉద్దేశ్యమన్నారు. కాశ్మీర్ అన్నది భారత్ లో అంతర్భాగమేనని.. కాకపోతే ఆర్టికల్ 370తో ప్రత్యేకంగా చూడాల్సి వచ్చిందన్నారు. పీఓకే కూడా భారత్లోదేనని అక్కడ 25 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, పీఓకెను ఎలా దక్కించుకోవాలో తమకు తెలుసన్నారు.