ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హురియత్ నేతలతో చర్చల్లేవ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 06, 2019, 06:50 PM

కాశ్మీర్ పునర్విభజన బిల్లుపై హురియత్ నేతలతో ఎలాంటి చర్చలు ఉండబోవని.. జమ్మూకాశ్మీర్ లో బలగాలను వెనక్కు రప్పించేది లేదన్నారు హోంమంత్రి అమిత్ షా. లోక్ సభలో మాట్లాడిన అయన తాము ప్రజాస్వామ్యం ప్రకారమే ముందుకు వెళ్తున్నామని.. ఏపీ విభజన బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలా పాస్ చేసిందో గుర్తుచేసుకోవాలని.. ఆనాడు మీరు చేసింది ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. ఆర్టికల్ 370 వలన డెబ్భై ఏళ్లలో కాశ్మీర్ లో జరిగిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించిన షా పేదరికం వలన ఉగ్రవాదం పెరిగిందనే వాదనను తాము సమ్మతించమన్నారు. దేశంలో చాలాచోట్ల పేదరికం ఉందని.. అంతటా ఉగ్రవాదం లేదన్నారు. కాశ్మీర్ ప్రజలు వంద అడిగితే నూటపది ఇచ్చామని, అక్కడ వేయి కోట్లు ఖర్చుపెట్టామని అయినా ఎలాంటి ఉపయోగం లేదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com