బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఆగస్ట్ 3 నుంచి 6 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు వెల్లడించారు. ఆగస్టు 4, 5 తేదీల్లో దక్షిణ కోస్తా, మధ్య కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతాయని, సముద్రతీరంలో అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ తెలిపింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని, ప్రజలు తీరప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. గంటకు 50 నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేర్కొంది.