ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నారైలూ... ఓటు రిజిస్ట‌ర్ చేసుకోండి : ఈసి

international |  Suryaa Desk  | Published : Thu, Jul 25, 2019, 09:46 PM

 వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాసీయుల‌కు ఓటుహ‌క్కు క‌లిపిస్తునందున  ఆన్‌లైన్‌లో  తమ ఓటును తప్పక రిజిస్టర్ చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర ఎన్నారైల‌ను కోరారు. లండన్‌లో ఇండియన్ ప్రొఫెషనల్స్ ఫోరమ్(ఐపీఎఫ్) సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ 2019 ఎన్నికల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.15 లక్షల ఎన్నారైలు మాత్రమే తమ ఓటును రిజిస్టర్ చేసుకున్నారని ఆయన  వివ‌రించారు.  ప్రాక్సీ ఓటింగ్ బిల్లు లోక్‌సభలో పాస్ అయిందని.. రాజ్యసభలో పాస్ అయితే అది చట్టంగా మారుతుందన్నారు. ప్రాక్సీ ఓటింగ్‌తో పాటు ప్రస్తుతం దౌత్య సిబ్బందికి అందబాటులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ టెక్నిక్‌ పద్దతిని అనుసరించాలనే ఆలోచనలో కూడా ఎన్నికల కమిషన్ ఉన్నట్టు సుశీల్ తెలిపారు.  ప్రాక్సీ, ఎంబసీల ద్వారా ఎన్నారైల ఓటు హక్కు  పై  నిబంధనలు రూపొందుతున్నాయ‌ని,   అయితే ముందుగా ఎన్నారైలు తమ ఓటు  రిజిస్టర్ చేసుకోవాలన్నారు..  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com