గొడ్డలి వేటు సూత్రధారి(ఎంపీ అవినాష్రెడ్డి)ని అమాయకుడంటే రాష్ట్ర ప్రజలను కించపరచడమే, కడప ప్రజలను వంచించడమేనని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఐదేళ్లు ఎంపీగా పోటీచేసిన అవినాష్రెడ్డి ఒక చిన్న బాలుడు అనడంలో సీఎం జగన్ ఔచిత్యమేమిటో..? మీ బాబాయిని గొడ్డలి వేటు వేసిన ఘటనలో సూత్రధారి ఎలా అమాయకుడు అవుతాడు..? అవినాష్రెడ్డిని అమాయకుడు అంటున్న నీపై కూడా 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి.. మీరు కూడా అమాయకులేనా’’ అని వర్లరామయ్య ప్రశ్నించారు. ఆయన మోసాలు, అబద్ధాలను ఇక జనాలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జగన్ ఇక డ్రామాలు ఆపాలని హితవు పలికారు. చట్టాన్ని గౌరవించి కోర్టులకు హాజరవుతే ఆయన బయట ఉండేవారో లోపన ఉండేవారో తేలిసిపోయేదన్నారు. అవినాష్రెడ్డి అమాయకుడని జగన్ రెడ్డి చెబుతుంటే సీబీఐ ఎందుకు సైలెంట్గా ఉంది? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకానందారెడ్డి కేసులో సుత్రధారి అతనే అని.. అతను అమాయకుడు కాదని సీబీఐనే ప్రజలకు తెలియజేయాలని చెప్పుకొచ్చారు.