గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ను వైఎస్ కల అని, దానిని జగన్ నేతృత్వం చూస్తామని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అమరావతిలో తనని కలసిన పాత్రికేయులతో ఆమె మాట్లాడుతూ ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించి మహిళల పేరిట రిజస్ట్రేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారని.. సొంత ఇంటి కలను కూడా నెరవేర్చే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల్లాగే అమ్మ ఒడి కూడా అత్యంత ఆదర్శవంతంగా నిలచిపోవటం ఖాయమని, ‘అమ్మ ఒడి’ పథకం దేశంలోనే ఆదర్శంగా జగన్ పేరు చిరస్థాయిగా ఉంటుందని అన్నారామె.
ఏ ప్రభుత్వమైనా హామీ ఇస్తే, అందుకు చట్టాలు, జీవోల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేదని కానీ . సీఎం జగన్ మాటిస్తే జీవోలు, చట్టాలు అవసరం లేదన్న నమ్మకం ప్రతి మహిళకుఉందని, ఇప్పటికే వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టిందని , త్వరలో 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఐదేళ్లలో రూ.75వేలు అందించే హామీ అమలు కానుందని తద్వారా ప్రతి డ్వాక్రా మహిళకూ ఆర్థిక స్వావలంబన కల్పించడం ఖాయమన్నారు రోజా.