ఉత్తర్ ప్రదేశ్లో నీటి సమస్యను పరిష్కరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. 2021లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఇప్పటికే నీటిని పొదుపు చేయాలంటూ ఉత్తర్ ప్రదేశ్లోని గ్రామ సర్పంచ్లకు వ్యక్తిగత లేఖలు రాశారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి మోడీ ప్రభుత్వం 9 వేల కోట్ల రూపాయిలు విడుదల చేయనున్నది.