గుంటూరు: మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుటుంబంపై మరో ఫిర్యాదు నమోదైంది. ఇప్పటికే కే ట్యాక్స్ పేరుతో కోడెల కుమారుడు, కుమార్తె తమను వేధిస్తున్నారంటూ కొందరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాంపై శ్రీకాకుళానికి చెందిన రంజీప్లేయర్ నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైల్వేలో ఉద్యోగం పేరుతో రూ.15 లక్షలు తీసుకుని నకిలీ నియామకపత్రం ఇచ్చాడని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు.